తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

-

తిరుమల భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజు 23 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 60, 485 మంది దర్శించుకున్నారు.

10 hours for Sarvadarshan of Tirumala Srivari

అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 23, 851 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.1 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు తిరుమలలో మూడో రోజు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news