TTD : శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని 17 కంపార్టుమెంట్లలో వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 08 గంటల సమయం పడుతుంది.

TTD

ఇక నిన్న 71, 939 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 26, 327 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 4. 9 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది. కాగా,ఇవాళ అక్టోబర్ నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టికెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి.

అలాగే, ఇవాళ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. రేపు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు విడుదల అవుతాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టిటిడి పాలక మండలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news