TTD: తిరుమల చిరుతదాడిలో గాయపడ్డ చిన్నారి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

-

తిరుపతి: చిరుత దాడిలో గాయపడ్డ చిన్నారి కౌశిక్ ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాడు చిన్నారి కౌశిక్. చిన్నారి డిశ్చార్జి కార్యక్రమానికి హాజరయ్యారు టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి. చిన్నారి కుటుంబానికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేసింది టిటిడి. దీంతో తిరుమలకు బయలుదేరారు చిన్నారి కౌశిక్, తల్లిదండ్రులు శిరీష, కొండా. ఇక దేవుని దయతో బాబు పూర్తిగా కోలుకున్నాడని అన్నారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

ఇటీవల తిరుమల నడక మార్గం ఏడవ మైలు వద్ద చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఐదు సంవత్సరాల బాలుడిని చిరుతపులి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా సమీపంలో విధులలో ఉన్న పోలీసులు గమనించి వెంటనే గట్టిగా అరవడంతో చిరుత ఆ బాలుడిని వదిలి వెళ్ళిపోయింది. తీవ్ర గాయాల పాలైన బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా బాలుడు నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news