జనసేన నాయకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం

-

జనసేన నాయకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అక్కా చెల్లెల్లను వేధింపులకు జనసేన నాయకుడు గాజుల పాండు, అతని కుమారులు నాగబాబు మరియు సూరి గురిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

janasena
janasena

కృష్ణ జిల్లా ఒంటుమిల్లి మండలం పెందుర్రు గ్రామానికి చెందిన అక్కా చెల్లెల్లను కాలేజ్ కు వెళ్లి వస్తున్న సమయంలో వేధిస్తూ, గ్రామంలో యువతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడట జనసేన పార్టీ నాయకుడు. వేధింపులు మితిమీరడంతో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ప్రాణాపాయ స్థితి నుండి బయటపడిందట యువతి. కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు అవ్వడంతో పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంలేదని ఆరోపిస్తున్నారు బాధితులు.

Read more RELATED
Recommended to you

Latest news