రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది – పురందేశ్వరి

-

తూర్పుగోదావరి: రాజమండ్రి బిజెపి కార్యాలయంలో రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి మురళీధరన్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బిజెపి నేత పురందేశ్వరి, తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే బిజెపిలో చేరే వారిపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

ఏపీలో జిల్లాల వారీగా చేరికలపై దృష్టి కేంద్రీకరించింది బిజెపి కోర్ కమిటీ. అలాగే బిజెపితో టచ్ లోకి వస్తున్న వారి జాబితా పై చర్చించింది. ఇక ఈ సమావేశం అనంతరం బిజెపి నేత పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆరోపించారు. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలన్నారు. బిజెపి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు పురందేశ్వరి. అలాగే బిజెపికి అందరూ మద్దతు ఇస్తున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news