వల్లభనేని వంశీకి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

-

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ షాక్ తగిలింది. తనకు బెయిల్ కావాలంటూ ఆయన ఇటీవల విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాజ్యంపై ఇవాళ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది చేసింది. వంశీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ వంశీకి మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది.

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ 71వ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో వంశీని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఈ కేసుతో పాటు  ఆయనపై మరిన్ని కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ కోర్టును ఆశ్రయించారు. కానీ ఆయనకు కోర్టులో ఊరట లభించలేదు. వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version