పవన్ కళ్యాణ్ ది పవిత్రమైన వారాహి వాహనం కాదు.. ఒక పంది – అంబటి రాంబాబు

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఏపీలో రాబోయే ఎన్నికలలో దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కోబోతున్నామని అన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన దత్తపుత్రుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడని.. పొత్తుల విషయంలో వారికే క్లారిటీ లేకున్నా.. తానే ముఖ్యమంత్రిని అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కాపులను వాడుకుని వదిలేస్తారని ఆరోపించారు.

ఆయన ప్రయాణిస్తున్న వారాహి వాహనంపై సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. అది పవిత్రమైన వారాహి వాహనం కాదని.. ఒక పంది అని అభివర్ణించారు. పంది వాహనంపై ఎక్కి పవన్ కళ్యాణ్ బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఆయనకు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆయన మాటల వల్లే అతని గ్రాఫ్ పూర్తిగా పడిపోతుందని అన్నారు అంబటి రాంబాబు. ఓ సినిమా హీరో వస్తే జనం భారీగా వస్తారని.. అది బలం అనుకుంటే పొరపాటేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news