మరో మూడు రోజుల్లో నా నిర్ణయం చెప్తా – పొంగులేటి

-

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. పొంగులేటి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఫిరోజ్ ఖాన్ ఇతర నాయకులు. వీరి సమావేశం సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. భేటీ అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో చేరికపై మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి , చిన్నారెడ్డి, మల్లు రవి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించినట్లు చెప్పారు. బిఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. పార్టీలో చేరికపై అన్ని వర్గాల సలహాలు తీసుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రజల కోసం అందరం ఏకం అవుతున్నామని ప్రకటించారు. తెలంగాణ వచ్చాక ప్రజల కలలు సహకారం కాలేదని తెలిపారు పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Latest news