చంద్రబాబు నాయకత్వంలో కూటమి అధికారంలోకి రాబోతుంది – వసంత కృష్ణప్రసాద్‌

-

చంద్రబాబు నాయకత్వంలో కూటమి అధికారంలోకి రాబోతుందని కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. చంద్ర బాబు నాయకత్వం లో కూటమి అధికారంలోకి రాబోతుంది…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు అని వెల్లడించారు.

IVRS survey on MLA Vasantha Krishna Prasad’s name as TDP candidate

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు లాగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు ఎన్టీఆర్…తెలుగు జాతి ఖ్యాతి నీ ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటూ కొనియాడారు.

హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడం చాలా బాధాకరమన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీ కి పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రకటించారు కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందం గా ఉందన్నారు కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news