‘భారతరత్న’ పురస్కారంతోనే ఎన్టీఆర్‌కు సముచిత గౌరవం: చిరంజీవి

-

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు అంజలి ఘటిస్తూ ఆయనతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ఆయన కీర్తి భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. ఈ మేరకు ఎన్టీఆర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా షేర్ చేసి ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘కొందరి కీర్తి అజరామరం.. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తుచేసుకుంటున్నాను. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలకు ‘భారతరత్న’ పురస్కారం సముచిత గౌరవమని భావిస్తున్నాను. తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను’’ అని చిరంజీవి ఈ పోస్టులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news