గన్నవరం వైసీపీలో ముదిరిన వివాదం.. వంశీతో కలిసి పని చేయనన్న వెంకట్రావు !

-

గన్నవరంలో తన పుట్టిన రోజు వేడుకల నిర్వహణ విషయంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. గన్నవరం వైసీపీలో నాకు గ్రూపులు లేవన్న ఆయన వంశీతో కలిసి పని చేయను అని సీఎం జగన్ కి చెప్పేసానని అన్నారు. వంశీ నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారన్న ఆయన ఇప్పుడు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. పార్టీని బలహీనం చేయటం ఇష్టంలేకే నేను గన్నవరం వెళ్ళటం లేదన్న ఆయన వైసీపీ వంశీకి అద్దె ఇల్లు అయితే నాకు సొంత ఇల్లు అని అన్నారు.

వైసీపీ నా స్వస్థలం..నా సొంత పార్టీ అన్న ఆయన వంశీ వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని అన్నారు. పలు గ్రామాల్లో మా పార్టీ కార్యకర్తలను నా జన్మదిన వేడుకలు జరపద్దని వంశీ ఇబ్బంది పెట్టారని, వంశీతో నేను కలిసి పని చేయటం జరగదని అన్నారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న ఆయన ఎమ్మెల్యే, మంత్రి ఒత్తిడి ఉందంటూ పోలీసులు చెబుతున్నారని అన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదన్న ఆయన వారికోసం ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీడా ఉన్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news