తెలంగాణలో టీడీపీ పోటీ..విజయసాయిరెడ్డి సెటైర్లు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీ పోటీ చేయడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయదట… క్యాండిడేట్లు దొరకడంలేదని అనుకోవాలా? 87 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించారని ఎద్దేవా చేశారు సాయిరెడ్డి.

తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు గారు తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్నారు. ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నారు. హక్కుల కోసం పోరాడే పేదలను అణిచివేయాలని చూసినప్పుడు ‘స్వేచ్ఛకు బేడీలు’ వేస్తారా అని, పౌర సంఘాలు నిరసన తెలపడం చూశామని తెలిపారు సాయిరెడ్డి. చంద్రబాబు గారు అనే అవినీతి తిమింగలాన్ని సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుంది. ఈ ఫోటో షూట్ ఐడియా లోకేశ్ దేనని టీడీపీ వర్గాల బోగట్టా! అంటూ చురకలు అంటించారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news