నారా లోకేస్‌ కు గాలికుంటు వ్యాధి – విజయసాయి

-

నారా లోకేస్‌ కు గాలికుంటు వ్యాధి వచ్చిందంటూ వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సెటైర్లు పేల్చారు. ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అని ఫైర్‌ అయ్యారు. నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారు లోకేశ్ గారు. గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు. ఛాలెంజికి కూడా ఒక స్థాయి ఉండాలని చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.

అటు పురంధేశ్వరి గారూ..మీరు పచ్చ కళ్లద్దాలు పెట్టుకున్నారా ? అని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. RBI నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి (GSDP) చంద్రబాబు గారి హయాంలో (2018-19) కంటే రెట్టింపై రూ.13.2 లక్షల కోట్లకు పెరిగిందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి ఐదో స్థానంలో వెలుగు లీనుతోందని పేర్కొన్నారు. గతంలో 15వ స్థానంలో పాతాళంలో ఉండేదని తెలిపారు. పచ్చ కళ్లద్దాల వల్ల మీకు ఈ అభివృద్ధి కనిపించడం లేదు కదా పురంధేశ్వరి గారూ! అంటూ చురకలు అంటించారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news