వైసీపీ నేతల్లో అసంతృప్తి…రంగంలోకి విజయసాయిరెడ్డి ?

-

వైసీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. అయితే… అభ్యర్థులను మార్చిన సెగ్మెంట్లలో సమన్వయం కోసం వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. వైసీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ముందుకు ప్రకాశం జిల్లా పంచాయతీ వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో మార్పులు చేసింది వైసీపీ హైకమాండ్. మంత్రి మేరుగ, బాలినేని, మాగుంట, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, కొండెపి నియోజకవర్గ నేతలు హాజరు అయ్యారు.

కొండెపి నియోజకవర్గ ఇంచార్జు అశోక్ బాబు స్థానంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కు తాజాగా బాధ్యతలు అప్పగించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యేకు సుధాకర్ బాబుకు ఛాన్స్‌ ఇవ్వలేదు. అయితే… తాజా మార్పులపై పలువురు నేతలలో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ కీలక నేతలతో సమావేశమయ్యారు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. గ్రూప్ తగాదాలు పక్కన పెట్టి పార్ట గెలుపు కోసం కృషి చేయాలని సూచిస్తున్నారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news