పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి

-

వైసీపీలో చాలామంది నేతలు పార్టీ మారెందుకు చూస్తున్నారు. ఇందులో చాలామంది అధికారం పోవడంతో జగన్ను ఒంటరి చేసేందుకు… బయటకు వెళ్ళిపోతున్నారు. ఎన్నికల కంటే ముందు… ఆ తర్వాత కూడా చాలామంది పార్టీ మారారు. అయితే ఇలాంటి నేపథ్యంలో… జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు, వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా… భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది.

Vijayasai Reddy gave clarity on party change

అయితే పార్టీ మారడంపై తాజాగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పందించారు. తాను మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు ఎవరు నమ్మకూడదని కోరారు. తాను వైసిపి పార్టీకి విధేయత అలాగే అంకితభావం నిబద్ధత కలిగిన కార్యకర్తలని ఆయన స్పష్టం చేశారు. జన్మలో కూడా వైసీపీ పార్టీని వీడే ప్రసక్తే లేదని తెలిపారు. తన ప్రాణం ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డితో కలిసి పని చేస్తానని వెల్లడించారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news