వేణు స్వామికి బిగ్ రిలీఫ్..మహిళా కమిషన్ మీద హైకోర్టు ఆగ్రహం

-

ప్రముఖ జ్యోతిష్యుడు, టాలీవుడ్ సెలబ్రిటీ వేణు స్వామికి భారీ రిలీఫ్ దక్కింది. గత కొన్ని రోజులుగా.. వేణు స్వామిని తెలుగు జర్నలిస్టులు ఒక ఆట ఆడుకుంటున్నారు. అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయిన తర్వాత వారి జాతకాన్ని తెలియజేశారు వేణు స్వామి. సమంత లాగే శోభిత తన పెళ్లి తర్వాత ఇబ్బందులను ఎదుర్కొంటుందని వేణు స్వామి ప్రకటించడం జరిగింది. అయితే దీంతో… వేణు స్వామి పై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు టాలీవుడ్ జర్నలిస్టులు.

టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీలు, జర్నలిస్టుల జాతకాలు చెబుతూ వేణు స్వామి అందర్నీ మోసం చేస్తున్నాడని… అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు జర్నలిస్టులు. అయితే ఈ కేసును చాలెంజిగా తీసుకున్న వేణు స్వామి హైకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా వేణు స్వామికి భారీ ఊరట లభించింది. వేణు స్వామికి మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు సీరియస్ అయింది. మహిళా కమిషన్ను టార్గెట్ చేస్తూ హైకోర్టు మండిపడింది. అక్కినేని నాగచైతన్య అలాగే శోభితలకు లేని సమస్య ఫిలిం జర్నలిస్టులకు ఎందుకంటూ అంటించింది హై కోర్ట్. మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news