రాహుల్‌ గాంధీకి స్వాగతం పలికే ఎవరైనా ఆంధ్రా ద్రోహులే – విష్ణువర్దన్ రెడ్డి

-

ఇవాళ్టి నుంచి రాహుల్‌ గాంధీ.. ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణు వర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహులుకు స్వాగతం పలికే ఎవరైనా ఆంధ్రా ద్రోహులేనని హాట్‌ కామెంట్స్‌ చేశారు విష్ణువర్దన్ రెడ్డి.

దేశ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ని వదిలించేసుకున్నారు..రాహుల్ గాంధీ ది భారత్ జోడో యాత్ర కాదు విహార యాత్ర అని ఆగ్రహించారు. రాహుల్ దేశంలో ఐదు రోజులు మాత్రమే ఉంటాడు.. 25 రోజులు విహార యాత్ర చేస్తారు.. రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని ఎపి లోకి వస్తారని ఆగ్రహించారు.

అనేకమైన నేతలను కాంగ్రెస్ పార్టీ అవమానించింది… కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లనే తెలుగుదేశం పుట్టిందని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో టిఆర్ఎస్, టిడిపి వైసిపి ఇలా పార్టీలన్నీ కాంగ్రెస్ అహంకాపూరితంగానే వచ్చిన పార్టీలు అన్నారు. హిందువుల వ్యతిరేకి రాహుల్ గాంధీ మంత్రాలయంలో అడుగు పెట్టొద్దు…రాహులుకు స్వాగతం పలికే ఎవరైనా ఆంధ్రా ద్రోహులేనని తెలిపారు.
రాహుల్ తిరిగే ప్రాంతాల్లో బీజేపీ నేతలు ప్రజలతో కలిసి రోడ్లన్నీ శుభ్రం చేస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version