వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్‌..పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

-

సుప్రీం కోర్టులో వైయస్ వివేకా హత్య కేసులో ఇవాళ విచారణ జరిగింది. అయితే, ఈ సందర్భంగా ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసును పూర్తిగా విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను హైకోర్టుకు ఇచ్చింది సుప్రీంకోర్టు. దస్తగిరికి క్షమాభిక్ష సవాలు చేసేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా తనను గుర్తించాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ఎంవీ కృష్ణారెడ్డి.

గతంలో ఏపీ నుంచి తెలంగాణకు కేసును బదిలీ చేస్తూ వివేకా సతీమణి, కుమార్తె సునీతాలను నిజమైన బాధితులుగా గుర్తించింది సుప్రీంకోర్టు. ఈ నేపధ్యంలో బాధితులు ఎవరన్నదానిపై సుప్రీంలో స్పష్టత తీసుకోవాలని ఎంవీ కృష్ణారెడ్డికి తెలిపింది హైకోర్టు.

ఇక హైకోర్టు నిర్ణయంతో సుప్రీంను ఆశ్రయించారు ఎంవీ కృష్ణారెడ్డి. కానీ ఎంవీ కృష్ణారెడ్డి పిటీషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో జోక్యం చేసుకోడానికి తాము సిద్దంగా లేమని తేల్చి చెప్పింది జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం. వాద ప్రతివాదులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో హైకోర్టు ముందే చెప్పుకోవచ్చని చెప్పిన ధర్మాసనం… సుప్రీంకోర్టు అభిప్రాయాలతో సంబంధం లేకుండా… హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news