జోగి రమేష్ కుటుంబం పై దాడి, అరెస్ట్ విషయంలో న్యాయపోరాటం చేస్తాం : పేర్నినాని

-

జోగి రమేష్ కుటుంబం పై దాడి, అరెస్ట్ విషయంలో న్యాయపోరాటం చేస్తామని మాజీ మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. తాజాగా ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జోగి రమేష్ కుటుంబమే నేరం చేసినట్టు ముద్దాయిగా చేర్చారు. ఎవ్వరినీ వేధించినా న్యాయ పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు.

అగ్రి గోల్డ్ ఆస్తులు బోలెడు ఉన్నాయి.చంద్రబాబు నాయుడు మనుషులే కొనుక్కున్నారు. చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్న వారే కొనుక్కున్నారు. నిజంగానే జోగి రమేష్ గారిని ఏమి చేయలేక పిల్లలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నిజంగా తప్పు చేస్తే ఉరి వేయండి అని జోగి రమేష్ గారు ఆల్రెడీ చెప్పారని గుర్తు చేశారు. ఇధి అగ్రిగోల్డ్ ఆస్తి కాదు.. రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు పేర్ని నాని. చంద్రబాబు నాయుడు కావాలనే జోగి రమేష్ కుటుంబం పై ఈ దారుణానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news