వైసీపీ పేరులో వైఎస్ ఎక్కడున్నాడు జగన్..? – కన్నా లక్ష్మీనారాయణ

-

అమరావతి: ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉచ్ఛ నీచాలు లేకుండా మాట్లాడటం సీఎం జగన్ కే చెల్లిందన్నారు టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ. శనివారం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం తండ్రి పేరుని, తల్లి, చెల్లిని వాడుకొని వదిలేసిన జగన్ రెడ్డి.. సిగ్గులేకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. జగన్ పక్కన ఉన్నవారే గతంలో జగన్ లాంటి వాడు నీకొడుకుగా పుట్టాల్సిన వాడు కాదని రాజశేఖర్ రెడ్డితో అనలేదా..? అని ప్రశ్నించారు.

వైసీపీ పేరులో వైఎస్ ఎక్కడున్నాడు జగన్..? అని నిలదీశారు కన్నా లక్ష్మీనారాయణ. యువజన, శ్రామిక రైతు పార్టీ పాలనలో ఏవర్గం సంతోషంగా ఉందో చెప్పాలన్నారు. ఎన్నికల కోసం జగన్ ఎంత ఆత్రుత పడుతున్నాడో.. సైకో సీఎంను సాగనంపడానికి ప్రజలు అంతకంటే ఎక్కువగా వేచి చూస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news