టీడీపీలోకి యార్లగడ్డ..! నేడు అనుచరులతో కీలక భేటీ

-

గన్నవరం వైసీపీ నేత యర్లగడ్డ వెంకట్రావు ఇవాళ ముఖ్య అనుచరులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొంతకాలంగా యార్లగడ్డ తీరుపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

పార్టీలో ఉండలేనివారు వెళ్లిపోవచ్చని ఇటీవల యార్లగడ్డకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. గన్నవరం నుంచి పోటీ చేస్తానని సజ్జల స్పష్టం చేయడంతో… లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరుతానని ప్రచారం సాగుతోంది. కాగా, గత ఆదివారం గన్నవరంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించిన యార్లగడ్డ..ఆ సమావేశంలో వైసీపీ అధిష్టానం తనకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించి, మళ్లీ తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. యార్లగడ్డ మీటింగ్ పై సజ్జల కౌంటర్ ఇవ్వటంతో అధిష్టానం ఆయన్ని లైట్ తీసుకుందనే చర్చ జరిగింది. ఇక వారం వ్యవధిలో రెండో మీటింగ్ కి యార్లగడ్డ సిద్దమవడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news