BREAKING : షర్మిలను హౌజ్ అరెస్టు చేసిన పోలీసులు

-

వైఎస్‌ షర్మిలను హౌజ్ అరెస్టు అయ్యారు. ఇవ్వాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు వైఎస్ షర్మిల. ఈ తరుణంలోనే.. వైఎస్‌ షర్మిలను హౌజ్ అరెస్టు అయ్యారు. ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. కాగా, దళితబందు పథకంలో అక్రమాలపై ప్రశ్నించాలని స్థానికుల నుంచి ఆహ్వానం అందడంతో… ఇవాళ గజ్వేల్‌కు వెళుతున్నారు షర్మిల.

ఈ మేరకు షర్మిలకు వినతిపత్రం పంపించారు జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామ వాసులు. ఇటీవల తీగుల్ గ్రామంలో సీఎం దిష్టిబొమ్మ దగ్దం చేసి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. పథకంలో అక్రమాలు జరిగాయని, అర్హులకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తీగుల్ గ్రామ ప్రజలు. స్థానిక ప్రజలనుంచి వచ్చిన వినతి మేరకు తీగుల్ గ్రామానికి ఇవాళ ఉదయం 10 గంటలకు వెళ్లనున్నారు షర్మిల. షర్మిల వస్తుందని తెలిసి హెచ్చరికలు పంపుతున్నారు స్థానిక బీఆర్ఎస్ లీడర్లు.

Read more RELATED
Recommended to you

Latest news