జ‌గ‌న్ కు షాక్‌.. అమ‌రావ‌తి రైతుల స‌భ‌కు వైసీపీ ఎంపీ

-

ఏపీ ముఖ్య మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి … వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మ‌రోషాక్ ఇచ్చారు. వైసీపీ పార్టీకి వ్య‌తిరేకంగా.. అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు వ‌చ్చారు ఎంపీ ర‌ఘు రామ కృష్ణం రాజు. ఈ నేప‌థ్యంలోనే… ఆయ‌న ఇవాళ ఢిల్లీ నుంచి తిరుప‌తి కి వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ.. అమరావతి పరి రక్షణ మహోద్యమ సభలో పాల్గొనేందుకు వచ్చాన‌ని పేర్కొన్నారు. అడ్డం ప డే మేఘాలు అశాశ్వతం, అమరా వతే శాశ్వతమ‌న్నారు. న్యాయంగా అమరావతి లోనే రాజధాని ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. ఇది దగా పడ్డ రైతుల సభ, రాజకీయ సభ కాదని వెల్ల‌డించారు. ఈ సభ తరువాత మూడు రాజధానుల గురించి మాట్లాడే వారు ఉండరని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పడ్డ వాడు చెడ్డ వాడు కాదు, చంద్రబాబు చెడ్డ వాడు కాదంటూ కొనియాడారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.

 

Read more RELATED
Recommended to you

Latest news