విషాదం.. పెళ్లిచూపులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

-

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి చూపులకు వెళ్తూ ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారాన్ని యువకుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీ కొంది. ఈ ఘటనలో కారులోని రేణిగుంట మండలం ఆర్‌. మల్లవరం గ్రామానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం కుమారుడు పాలపర్తి సందీప్‌ (31) దుర్మరణం చెందాడు. యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుటుంబ సభ్యుల కోరిక అక్కడ మానేసి  బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. పెళ్లి చూపులున్నాయని తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో బెంగళూరు నుంచి స్వగ్రామం వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఏఎస్సై సుధాకర్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news