వైసీపీ నేతలతో జగన్‌ అత్యవసర సమావేశం..!

-

వైసీపి ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుపై నేతలతో చర్చిస్తున్నారు జగన్. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కన్నబాబు సహా పలువురు నేతలతో జగన్ భేటీ అయ్యారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై చర్చ నిర్వహించనున్నారు. ఇక సుప్రీం కోర్టు తీర్పుపై టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..స్పందించారు. లడ్డులో విషయంలో సుప్రీంకోర్టు అదేశాలను స్వాగతిస్తున్నాం‌నని ప్రకటించారు.

నేను ,వైవీగాని చైర్మన్ లు ఎలాంటి తప్పుచేయలేదన్నారు. కేవలం మాపై కుట్రతో బురద చల్లారని ఆగ్రహించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేయాల ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రం ప్రభుత్వం ఎర్పాటు చేసినా సిట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని మా భావన…చంద్రబాబు కల్తీ జరిగిందని చెప్పినా తరువాత సిట్ ఎలా పనిచేస్తోందో అందరికీ తెలుసు అని తెలిపారు. కాని సుప్రీంకోర్టు ఆదేశాలతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయాని నమ్మకం ఉందని.. వెంకటేశ్వర స్వామే స్వయం కోర్టు ద్వారా ఇప్పించారని భావిస్తున్నామని పేర్కొన్నారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news