నేడు పులివెందులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనం

-

YS Jagan Mohan Reddy is going to Pulivendu today: నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్లనున్నారు. ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారిగా పులివెందులకు వస్తున్నారు వైఎస్‌ జగన్. ఇందులో భాగంగానే…ఇవాళ ఉదయం విజయవాడ నుంచి కడపకు చేరుకోనున్నారు జగన్. కడప ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు పయనం కానున్నారు.

YS Jagan Mohan Reddy is going to Pulivendu today

పులివెందులలోని బాకరాపురంలో ఉన్న తన నివాసం చేరుకోనున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.
ఇక ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పులివెందుల చేరుకోనున్నారు జగన్. భవిష్యత్ కార్యాచరణ పైన పులివెందుల నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమ జిల్లాల YCP నేతలు, కార్యకర్తలతో ఆయన విడివిడిగా సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక నిన్న జగన్.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news