చంద్రబాబు ప్ర‌భుత్వానికి వైఎస్ జ‌గ‌న్ కీల‌క సూచ‌న‌

-

YS Jagan’s key advice to Chandrababu Govt: చంద్రబాబు ప్ర‌భుత్వానికి వైఎస్ జ‌గ‌న్ కీల‌క సూచ‌న‌లు చేశారు. లడఖ్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన ముగ్గురు జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేయాల‌ని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విజ్ఞప్తి చేశారు.

YS Jagan’s key advice to Chandrababu Govt

ఒక్కో కుటుంబానికి రూ. కోటి చొప్పున ఆర్ధిక సహాయం చేయాలన్నారు. దేశ రక్షణలో జవాన్ల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు వైసీపీ నేతలు కూడా అండగా నిలబడాలని సూచించారు.

ఇక అటు ఇవాళ మూడు శాఖల పని తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు, చేర్పులపై సమీక్ష ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహరాలపై చర్చించనున్న ఏపీ సీఎం….పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని చర్చించనున్నారట. ఇసుక మాఫియా అరాచకాల వల్ల ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణ ఉన్నాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news