నన్నయ్య వర్సిటీ వీసీ పద్మరాజు రాజీనామా..!

-

ఏపీలో ప్రభుత్వం మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా యూనివర్సిటీల్లో వైస్ ఛాన్స్ లర్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇటీవలే పలు యూనివర్సిటీలకు చెందినటువంటి వైస్ చాన్స్ లర్లు రాజీనామా చేశారు. మరికొందరూ బదిలీ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే ఇవాళ తాజాగా ఆదికవి నన్నయ్య వర్సిటీ వైస్ ఛాన్స్ లర్   కె.పద్మరాజు తన పదవికి రాజీనామా చేశారు.

ప్రదానంగా తన పదవీ కాలం మరో రెండేళ్ల పాటు ఉన్నప్పటికీ వీసీ బాధ్యతల నుంచి ఆయన అనూహ్యంగా తప్పుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను మెయిల్ ద్వారా గవర్నర్ జస్టీస్ ఎస్ నజీరక్కు పంపారు. కాగా, వ్యక్తిగత కారణాల చేత వీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా పద్మరాజు ఆ లేఖలో వెల్లడించారు. అదేవిధంగా తన రాజీనామా లేఖను ఉన్నత విద్యా మండలికి పంపారు.

Read more RELATED
Recommended to you

Latest news