నేటి నుంచి జిల్లాల్లో వైఎస్ షర్మిల పర్యటన

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పర్యటించనున్నారు. తొమ్మిది రోజులపాటు సాగనున్న ఈ పర్యటన శ్రీకాకుళం జిల్లాతో ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఇచ్ఛాపురంలో షర్మిల సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురంలో సమీక్షించిన తర్వాత సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా సమీక్షను విజయనగరంలో నిర్వహిస్తారు.

24వ తేదీన విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, 25వ తేదీన కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, 26వ తేదీన తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. 27వ తేదీన గుంటూరు, పల్నాడు, 28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, 29వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, 30వ తేదీన శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, 31న నంద్యాల, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో షర్మిల పర్యటన సాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news