నాన్న హత్యలో వారి ప్రమేయం ఉంది: వివేకా కుమార్తె

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటితో నాలుగేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా వివేకా హత్య పై ఆయన కుమార్తె  సునీతారెడ్డి స్పందించారు. ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని అన్నారు. వివేకా వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని ఆయన ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు.

‘‘కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు. నాకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్లలో రూపంలో సమర్పించాను. కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని నాకు తెలుసు. హత్య కేసులో ప్రయేయం ఉందని నమ్ముతున్నందునే వారిపై సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నాను. నాన్న హత్యపై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడారు. కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నారు. నాన్నను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెట్టగలను?’’ అని సునీత వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news