అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపూర్ వాసులు దుర్మరణం

-

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. వీరంతా ఏపీకి చెందిన వారుగా తెలిసింది. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం గురించి మృతుల కుటుంబాలకు స్థానిక అధికారులు సమాచారం అందించారు.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అమెరికాలోని టెక్సాస్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ముమ్మిడివరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులుగా అమెరికా అధికారులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో పొన్నాడ నాగేశ్వరరావు, భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. ఆయన అల్లుడు లోకేశ్‌ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మృతుల బంధువులకు సమాచారం అందించినట్లు తెలిపారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version