చంద్రబాబు సర్కార్ విధానాలకు నిరసనగా.. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం జరుగనుంది. ఈ తరుణంలోనే జూన్ 4న వెన్నుపోటు దినం పోస్టర్ ను ఆవిష్కరించారు వైసీపీ నేతలు. ఈ సందర్భంగా మాజీ వైసిపి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు మాట్లాడుతూ… ఇకపైన చంద్రబాబు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ప్రకటించారు.

అడుగడుగునా వెంటపడతామని… ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా… ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఏపీ ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తామని… మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసిపి పార్టీ అని వెల్లడించారు. ఈ విషయంలో ఎవరేం చేసినా… తగ్గేదే లేదన్నారు. కూటమి ప్రభుత్వాన్ని… ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. అందుకే వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.