మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగను తాగడం వలన అనేక సమస్యలు తగ్గుతాయి. చాలామంది మజ్జిగను రెగ్యులర్గా తాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో మజ్జిగ తాగడం వలన డిహైడ్రేషన్ సమస్య ఉండదు. తిరిగి ఎనర్జీని కూడా పొందవచ్చు. మజ్జిగ తాగడం వలన జీర్ణ క్రియను కూడా మెరుగుపరచుకోవచ్చు. నిజానికి మజ్జిగ తాగడం వలన బాడీ కూల్ అవుతుంది. ఎండాకాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాలుగా మజ్జిగను తీసుకుంటూ ఉంటారు. ఇందులో ప్రోబయోటిక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
అయితే కొందరికి మజ్జిగ తాగడం మంచిది కాదు. కొంతమందికి పాలు కానీ, పాల ఉత్పత్తులు కానీ సరిగ్గా జీర్ణం కావు. పాలలో ఉండే లాక్టోస్ అందరికి మంచిగా పని చేయదు. అలాంటి వారు పాలు లేదా పాల ఉత్పత్తులు తీసుకుంటే కడుపులో నొప్పి, ఉబ్బరం, అసిడిటీ లాంటి సమస్యలు వస్తాయి. వారు మజ్జిగ తాగడం మంచిది కాదు. పాలు లేదా పాల ఉత్పత్తుల పట్ల అలెర్జీ ఉన్నవాళ్లు కూడా మజ్జిగకు దూరంగా ఉండాలి. లేకపోతే చర్మంపై దురదలు రావడం, దద్దుర్లు, శ్వాస సమస్యలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
జలుబు, దగ్గుతో సతమతమయ్యేవారు కూడా మజ్జిగను తాగకపోవడం మంచిది. మజ్జిగను తాగితే దగ్గు, శ్వాసకోశ సమస్యలు, జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గొంతు నొప్పి, స్లేష్మం పేరుకుపోవడం వంటి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఈ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మజ్జిగకు దూరంగా ఉంటేనే మంచిది.