రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలపై పవన్ కళ్యాణ్‌కు వైవీ సుబ్బారెడ్డి సవాల్

-

వైఎస్ జగన్ ప్రభుత్వం పై జనసేన అధినేత పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఆయన మీడియాతో మాట్లారు. రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలపై పవన్ కళ్యాణ్ చర్చలకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఎర్రమట్టి దిబ్బల దగ్గర ల్యాండ్ పూలింగ్ జరిగిందని, రిషికొండపై అక్రమ నిర్మాణాలుంటే సుప్రీంకోర్టు వదిలేస్తుందని ప్రశ్నించారు.

సుబ్బారెడ్డి. గీతం యూనివర్సిటీ అక్రమాలు పవన్ కి కనిపించవా..? ఆయన ఎన్ని పర్యటనలు చేసినా రాష్ట్రంలో మళ్లీ గెలిచేది వైసీపీనే అని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమపథకాలు రద్దు అయ్యే ప్రమాదముందన్నారు. అంతకు ముందు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవీ పై తన ఆసక్తిని ఇప్పటికే చెప్పానన్నారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని.. టీడీపీ-జనసేన ప్రభుత్వం, బీజేపీతో కలిసి వెళ్లడమా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు ఉన్న పాలకులను బాధ్యులుగా చేస్తామన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news