మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘యానిమాల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. చీఫ్ గెస్ట్ ఎవరంటే ?

-

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అర్జున్‌ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యానిమల్’. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్‌లు విడుద‌ల చేయ‌గా.. సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక అర్జున్‌ రెడ్డి త‌ర్వాత సందీప్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న మూవీ కావ‌డంతో ఆడియెన్స్‌ ఏ రేంజ్‌లో అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ వైలెంట్ మోడ్‌లో కనిపిస్తుండటంతో జనాల్లో కాస్త క్యూరియాసిటీ పెరిగింది. ఇక హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను డిసెంబర్‌ 1న గ్రాండ్‌ లెవల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్‌ వేడుకను ప్లాన్‌ చేశారు.ఇప్పటికే ముంబ‌యిలో చేసిన ప్ర‌మోష‌న్స్‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చింది. దాంతో తెలుగులోనూ అదే స్థాయిలో ప్రీ రిలీజ్‌ వేడుకను ప్లాన్‌ చేస్తున్నారు. దానికోసం హైద‌రాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీని ఎంచుకున్నారు. న‌వంబ‌ర్ 27 తేదిన ప్రీ రిలీజ్‌ వేడుక జరుగనుంది. ఇక ఈ విష‌యాన్ని రణబీర్ కపూరే స్వ‌యంగా వెల్ల‌డించ‌డం విశేషం. ఇక ఈ వేడుకకు ఓ టాలీవుడ్‌ స్టార్ హీరో గెస్ట్‌గా రానున్నాడట. అయితే ఆ హీరో ఎవ‌రు అనేది చిత్ర‌బృందం ప్ర‌క‌టించ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news