తిరుమల భక్తులకు శుభవార్త..ఈ నెల 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

-

తిరుమల భక్తులకు శుభవార్త.. చెప్పింది టీటీడీ పాలక మండలి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్దం చేసింది టీటీడీ పాలక మండలి. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5వ తేది వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

ఈ విషయాన్ని టీటీటీ పాలక మండలి అధికారిక ప్రకటన చేసింది. 26 వ తేదిన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఇందులో భాగంగానే.. అక్టోబర్ 1వ తేదిన గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు టీటీటీ పాలక మండలి.

అక్టోబర్ 5వ తేదిన చక్రస్నానం జరుగనుంది. బ్రహ్మోత్సవాలు సందర్భంగా సెప్టంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేది వరకు సర్వదర్శనం మినహా మిగిలిన దర్శనాలను రద్దు చేసిన టిటిడి.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్దం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news