సీఎం జగన్ కు మరో సలహా దారుడు !

-

సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసున్నారు. ఏపీ ప్రభుత్వంలో మరో సలహాదారుడి నియామకం జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు సలహాదారుడిగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొత్త నియామకం పై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

CM Jagan Mohan Reddy

ఆయన రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ళకు చెందిన పోతిరెడ్డి నాగార్జున రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన గతంలో ఎంపీపీగా, జడ్పిటిసి గా ఉన్నారు. అంతే కాదు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తల్లి కృష్ణమ్మ రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ గా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version