మహా సముద్రంలో మరో హీరోయిన్.. ఈ సారైనా అదృష్టం కలిసొస్తుందా..?

-

వరుస ఫ్లాపులు మూటగట్టుకున్న హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, తాజాగా మరో మంచి అవకాశాన్ని రాబట్టుకుంది. నాని హీరోగా మజ్ను సినిమాతో తెలుగు వారందరికీ పరిచయమైన అనూ ఇమ్మాన్యుయేల్, ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, శైలజా రెడ్డి అల్లుడు మొదలగు సినిమాల్లో చేసింది. ఐతే ఈ సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు సరికదా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో అనూకి ఫ్లాప్ హీరోయిన్ అన్న ముద్ర పడిపోయింది.

ఐతే తాజాగా శర్వానంద్ హీరోగా చేయనున్న మహాసముద్రం సినిమాలో అవకాశం వచ్చింది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఒకానొక హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ ఎంపికైంది. ఇప్పటికే అదితీ రావ్ హైదరీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్ అందులో చేరింది. మరి ఈ సినిమాతోనైనా ఫ్లాప్ హీరోయిన్ అన్న ముద్ర పోగొట్టుకుంటుందేమో చూడాలి. అన్నట్టు మహాసముద్రంలో శర్వానంద్ తో పాటు హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news