హత్రాస్ ఘటన మరవకముందే.. యూపీలో మరో దారుణం..?

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తరచూ వెలుగులోకి వస్తున్న ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ ఘటన మరవకముందే మరికొన్ని సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో రోజురోజుకి మహిళలకు కనీస రక్షణ కరువైంది అన్న వాదన వినిపిస్తోంది. ఇటీవలే ఉత్తరప్రదేశ్లో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లిన 12 మంది విద్యార్థులు… ఏకంగా రాక్షస ఆనందాన్ని పొందుతూ అత్యాచారం చేయడంతో పాటు వీడియో చిత్రీకరించడం లాంటివి చేసి దారుణంగా ప్రవర్తించిన ఘటన ఝాన్సీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.

పాలిటెక్నిక్ చదువుతున్న బాలిక కాలేజీ కి వెళ్తున్న సమయంలో 12 మంది విద్యార్థులు అడ్డుపడి బెదిరించి బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఓ విద్యార్థి అత్యాచారం చేసిన సమయంలో మిగితా 11 మంది సెల్ఫోన్ లలో అదంతా చిత్రీకరించి ఆ తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. చివరికి సదరు బాలిక దగ్గర్నుంచి రెండు వేల రూపాయలు లాక్కొని విడిచిపెట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news