అనుకి టాలీవుడ్ టాటా చెప్పేసిందా ..?

-

అనుపమ పరమేశ్వరన్.. ఒకప్పుడు పాప పేరు చెప్పగానే కుర్రకారు ఊగిపోయింది ,టాలీవుడ్ దాసోహం అంది.. మరి పాప అందం, అభినయం అలాంటిది.. అనుపమ కేరళ నుంచి వచ్చిన ఈ కుట్టి తెలుగు లో త్రివిక్రమ్ తీసిన అఆ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచియమైంది.. అందులో ఆమె చేసిన నాగవల్లి పాత్రకి ప్రాణం పోసింది అంతగా ఆమె అభినయం తో ఆకట్టుకుంది… ఆ సినిమా హిట్ కావడంతో పాపకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.. ప్రేమమ్ మూవీ లో చిన్న పాత్ర అయినా తన నటనతో కట్టిపడేసింది.

తర్వాత వచ్చిన సంక్రాంతికి విడుదలైన శతమానం భవతి తో సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఈ అమ్మడు రామ్ తో నటించిన  ఉన్నదీ ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే.. బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి.. దీనితో పాప కెరీర్ అయోమయం లో పడింది. తరవాత ఎన్నో ఆశలు పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ తో తీసిన తేజ్ ఐ లవ్ యు పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనితో అనుపమకు అవకాశాలు తగ్గాయి.. పాప తో మూవీ అంటే నిర్మాతలు ఆలోచనలో పడ్డారు డైరెక్టర్లు మొహం చాటేశారు. దీనితో పాప కోలీవుడ్ కి వెళ్లి అదృష్టం పరీక్షించుకుంది.

అక్కడ చేదు అనుభవమే ఎదురు అయింది ఈ అమ్మడుకి.. తర్వాత వచ్చిన బెల్లం కొండ శ్రీనివాస్ తో చేసిన రాక్షసుడు అనే రీమేక్ మూవీ చేసిన అందులో బెల్లం బాబు నటనకి మాత్రమే మంచిమార్కులు పడ్డాయి.. ఇక పాప అదృష్టం ఈ సినిమా తో అయినా మారుతుంది అనుకున్నారు.కానీ ఊహించినంత అవకాశాలు రాలేదు. అవకాశాలు కాదు కదా ఒక్క అవకాశం కూడా రాలేదు. దీనితో అను పాప చాల నిరాశ చెందింది. ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తుంది, కానీ టాలీవుడ్ మాత్రం పాప కి టాటా చెప్పినట్లు సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.. చూద్దాం ఎం అవుతుందో ..!

Read more RELATED
Recommended to you

Latest news