‘నిశ్శబ్దం’గా ఓటీటీలోకి అనుష్క ఎంట్రీ..!

-

టాలీవుడ్ కే కాదు యావత్ దక్షిణాదికి స్వీటీ హీరోయిన్ అయిన అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. థియేటర్ల కోసం చాలా కాలం వెయిట్ చేసిన అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా ఓటీటీ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయిపోయింది. అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. చాలా కాలం తర్వాత అనుష్క నటించిన సినిమా కావడంతో ఈ సినిమాకు దక్షిణాదివ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. దీంతో ఓటీటీ నుంచి చిత్రబృందానికి మంచి ఆఫరే వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుండగా.. సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’, కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ చిత్రాల ఓటీటీ రిలీజ్ ఇప్పటికే కన్‌ఫర్మ్ అయింది.

ఇప్పుడు నిశ్శబ్దం కూడా ఈ లిస్ట్‌లో చేరగా.. స్వీటీ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన చిత్రానికి కోన వెంకట్ నిర్మాత. కాగా గోపీ సుందర్, గిరీష్ జీ సంగీతం అందిస్తుండగా.. ఆర్.మాధవన్, అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news