శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆందోళన

-

శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఎనిమిది గంటలు ఆలస్యం అయింది. అయితే ఆ ఫ్లైట్ ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. 8 గంటల ఆలస్యం కావడంతో ఎప్పుడు బయలుదేరుతుందో సిబ్బంది క్లారిటీ ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

దీంతో ప్రయాణికులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం అవుతుందని, దాన్ని ఉదయం 11:30 గంటలకు వాయిదా వేసినట్లు తెలిపారు. కానీ మధ్యాహ్నం దాటిన విమానం కోసం వారంతా ఎదురుచూడాల్సి వచ్చింది. మధ్యాహ్నం దాటినప్పటికీ సిబ్బంది క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news