BREAKING : ఫిబ్రవరి నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

-

అమరావతి : బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించేందుకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ సన్నద్దం అవుతోంది. ఫిబ్రవరి మాసం చివరలో… లేదా మార్చి మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తాజాగా సమాచారం అందుతోంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ పై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి.

సుమారు 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని జగన్ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. కరోనా మహ్మామ్మారి నేపథ్యం లోనే… కేవలం 10 రోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని…. జగన్ మోహన్‌ రెడ్డి సర్కార్‌ భావిస్తోంది.

అంతేకాదు… కరోనా మహమ్మారి నేపథ్యం లో… కఠిన రూల్స్ పాటించాలని నిర్ణయం తీసుకోనుంది సర్కార్‌. ఈ సమావేశాల్లోనే బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టనుంది జగన్‌ సర్కార్‌. ఈ నేపథ్యంలోనే.. ఆర్థిక శాఖ అధికారులు కూడా అన్ని ఏర్పాట్ల ను చేస్తున్నారు. ఇక అటు ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లోకి సీఎం జగన్‌ కూడా మాట్లాడే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news