ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా..!

-

ఏపీ అసెంబ్లీ లో ఆర్థిక మంత్రి ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు మండలిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా వేశారు. ఐదేళ్లలో నాలుగు లక్షల 95 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి బుగ్గన అన్నారు ఏపీ లో తలసరి విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని అన్నారు. ప్రస్తుతం ఏడాదికి 14 యూనిట్ల తలసరి వినియోగం ఉందని అన్నారు.

ఇక ఇది ఇలా ఉంటే ఏపీ లో 2019 నుండి 311 పైగా భారీ మెగా పరిశ్రమలు 595 కోట్ల పెట్టుబడిని తెచ్చాయి అని అన్నారు. సింగిల్ విండో ద్వారా 54,292 దరఖాస్తుల్ని పరీక్షించి పరిష్కరించి అనుమతులు ఇచ్చామని అన్నారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు ఏపీ కి 65 కొత్త ఐటి కంపెనీలు వచ్చాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news