ఏపీ బీజేపీ ఇంచార్జి గా బండి సంజయ్ ?

-

తెలంగాణాలో కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కు బీజేపీ అధిష్టానం మొదటి నుండి కూడా సరైన ప్రాధాన్యతను ఇస్తూ వస్తోంది. ఈ మధ్యనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను ఆ పదవి నుండి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా బండి సంజయ్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించి సముచితమైన స్థానాన్ని కల్పించారు. ఇప్పుడు బండి సంజయ్ కు సంబంధించిన మరో వార్త కూడా వైరల్ గా మారింది. బీజేపీ అధిష్టానం బండికి ఏ బాధ్యతను అప్పగించినా సమర్థవంతంగా పనిచేసి మంచి ఫలితాన్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే ఇతనికి మరో అదనపు బాధ్యతను అప్పగించడానికి బీజేపీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంచార్జి గా బండి సంజయ్ ను నియమిస్తారట. ఏపీలో చాల బలహీనంగా ఉన్న బీజేపీని పైకి లేపడానికి బండిని రంగంలోకి దించుతున్నారట.

మరి బండి సంజయ్ పొలిటికల్ పనితీరు ఏపీలో పనిచేస్తుందా ? జగన్ చంద్రబాబు లాంటి వారిని ధాటి బీజేపీకి మైలేజ్ తీసుకురాగలడా ఆనంది తేలియాలనంటే కొంతకాలం ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news