ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌..

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌ ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం వచ్చే సంవత్సరం మార్చ్ 4 నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయి 21 తో ముగుస్తుండగా , ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారభం అయి 23 న ముగుస్తాయి.. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూలు వర్తించనుంది. వెల్లడించిన తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇక తెలంగాణా ఇంటర్ పరీక్షల తేదీలు ఇవే కావడం విశేషం.. ఇక ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జనవరి 28న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జనవరి 30న నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news