ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ సమావేశం..!

-

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్‌ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు. ముఖ్యంగా ఈ సమావేశంలో కరోనాని ఎలా కట్టడి చేయాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలి అనే వాటిమీద చర్చించానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news