ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా…24 గంటల్లో 2,498 కేసులు

-

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2498 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,41,327 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 24 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,178 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 23,843 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,04,306 లక్షలకు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 2201 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 88,149 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 37, 52, 356 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇది ఇలా ఉండగా… ఏపీలో మరో పది రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూను పొడగించింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news