ఏపీలో తగ్గిన కరోనా తీవ్రత… 24 గంటల్లో 1843 కేసులు

-

ఏపీ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త తగ్గాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1834 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,45,697 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 12 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,209 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,571 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,08,917 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 70,727 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 39, 09, 363 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో 2199 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news