ఏపీలో కొత్తగా 2058 కరోనా కేసులు, 23 మరణాలు

-

ఆంధ్ర ప్రదేశ్ లో గతంలో కంటే ప్రస్తుతం కరోనా కేసులు కాస్త తగ్గుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2058 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,63,280 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 23 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,377 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,180 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,28,723 లక్షలకు చేరింది.

ఇక గడిచిన 24 గంటల్లో 2053 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 2053 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 78, 992 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,45, 63, 043 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news